×

తెలంగాణ జర్నలిస్టులకు సీఎం దసరా కానుక

తెలంగాణ జర్నలిస్టులకు సీఎం దసరా కానుక

  25 రోజుల్లో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు

హైదరాబాద్ సెప్టెంబర్ 29(ఎక్స్ ప్రెస్ న్యూస్ ): తెలంగాణ జర్నలిస్టుందరికీ సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. జర్నలిస్టులందరికీ సీఎం దసరా శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో సింగరేణి కార్మికులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. రాబోయే 25 రోజుల్లో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని ఉద్ఘాటించారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు పెంచుతామని ప్రకటించారు. దసరా పండుగ తర్వాత అల్లం నారాయణతో సమావేశం ఏర్పాటు చేసి ఇండ్ల స్థలాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 2లేదా 3 ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల పరిశీలన జరిగిందని సీఎం తెలిపారు. వీలైతే ఒకే చోట ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇండ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు కూడా ఒకే చెప్పేసిందని వెల్లడించారు సీఎం.

print

Post Comment

You May Have Missed