కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి అండగా నిలుస్తుందని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.వివిధ జిల్లాలో గల జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా ఇందులో తాజాగా 21 మందికి పాజిటివ్ వచ్చిందని, మరో ముగ్గురు జర్నలిస్టులు హోంక్వారంటైన్ లో ఉండవలసిందిగా వైద్యాధికారులు సూచించారని తెలిపారు. 21 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున 4 లక్షల 20 వేలు, హోంక్వారైంటైన్ లో ఉన్న ముగ్గురు జర్నలిస్టులకు 10 వేల చొప్పున 30 వేలు, మొత్తం 4 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సహాయం ను తెలంగాణ చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.
ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ లు వచ్చిన 149 మంది జర్నలిస్టుల కు 29 లక్షల 80 వేల రూపాయలు, హోమ్ క్వారంటైన్ లో ఉన్న 72 మంది జర్నలిస్టుల కు 7 లక్షల 20 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించామని అన్నారు . దీంతో మొత్తం 221 మంది జర్నలిస్టులకు 37 లక్షల రూపాయలను మీడియా అకాడమీ నిధుల నుండి జర్నలిస్టుల ఖాతాలో నికి జమ చేశామని తెలిపారు.
జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ (8096677444) నెంబర్ కి పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ సెల్ నెంబర్ 9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు దృవికరించిన మెడికల్ రిపోర్టు లు అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.