తమ జీత భత్యాలు భారీగా పెంచినందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమకు పెంచిన జీతాలను ఈ సంవత్సరం జనవరి నెల నుంచి అమలు చేయాల్సిందిగా వారు ముఖ్యమంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు గంగారెడ్డి, నాగయ్య, సుదర్శన్, అంజిరెడ్డి, సురేఖలతో పాటు పదిజిల్లాల ఉద్యోగులు పాల్గొన్నారు.