జిల్లెలగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళా శాసనములతో, రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం సౌజన్యంతో, వికాస తరంగిణి మీర్పేట్ సహకారంతో, సీనియర్ జర్నలిస్ట్ వద్ది రాజు జనార్ధన రావు సమర్పణలో, జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు , వేముల రాజేశ్వర రావు సమన్వయంతో, డింగరి రంగాచార్యులు పర్యవేక్షణలో ప్రముఖ ధార్మికోపన్యాసకులు భాస్కరభట్ల ఆంజనేయశర్మ (ఎం.ఏ. జ్యోతిష్యం) తిరుప్పావై ప్రవచనాలు చేస్తున్నారు .
ముందుగా శ్రీమతి సువర్ణకుమారి బృందం, శ్రీమతి లావణ్యా బృందం ఆలపించిన భక్తి గోష్ఠి గానం భక్తులను ఎంతగానో అలరించింది .
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులు , వికాసతరంగిణి తోట వంశీకృష్ణ, ఆలయ అర్చకులు రాఘవాచార్యులు, గురు రాజ్, సత్యనారాయణ చార్యులు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుప్పావై ప్రవచనాలు, భక్తి గోష్ఠి గానం కార్యక్రమాలు ప్రతి రోజు సా|| 6 గంటల నుండి జరుగుతాయి. వచ్చే నెల జనవరి 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయిని, అందరూ ఆహ్వానితులే అని వద్ది రాజు జనార్ధన రావు తెలిపారు.