శ్రీశైల దేవస్థానం:ఘంటామఠ పునర్నిర్మాణ పనులలో ఈ రోజు 16 న మరో రెండు వెండి రూపాయి నాణెములు లభించాయి. ఈ వెండినాణెములు 1862వ సంవత్సరానికి చెందినవి.కాగా నిన్న 3 రాగిరేకులు (తామశాసనాలు), 245 వెండి రూపాయి నాణెములు, ఒక రాగినాణెము లభించిన విషయము తెలిసిందే.
ఘంటామఠప్రాంగణములో ప్రధానాలయానికి ఎదురుగా నైరుతి మూలలో ఉపాలయపు గోడల రాళ్లను తొలగిస్తుండగా ఈ వెండినాణెములు దొరికాయి.విషయము తెలిసిన వెంటనే కార్యనిర్వహణాధికారి, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్ ఇతర సంబంధిత అధికారులు ఘంటామఠం చేరుకుని నాణెములను పరిశీలించారు. నిబంధనల మేరకు రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షములో పంచనామ చేసి వివరాలను నమోదు చేసారు.
*Jwaala Veerabhadra swaamy puja and Sakshi Ganapathi abhishekam performed in the temple today.