శ్రీశైల దేవస్థానం:ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా శ్రీశైల దేవస్థానం పంచమఠాల జీర్ణోద్ధరణ పనులను చేపట్టింది. ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు.కాగా ఈ రోజు మధ్యాహ్నం ఘంటామఠ పునర్నిర్మాణ పనులు జరిపిస్తుండగా 3 రాగిరేకులు (తామ్రశాసనాలు), 245 వెండి రూపాయినాణెములు, ఒక రాగినాణెము, లభించాయి.
కాగా 5×9 అంగుళాల సైజు గల రాగిరేకులపై నాగరి, , కన్నడలిపి చెక్కి ఉంది. ఒక రాగిరేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా చిత్రీకరించి ఉంది. ఈ రాగిరేకుపై శివలింగంతో పాటు నంది కూడా చిత్రీకరించి ఉంది. అదేవిధంగా మరో రేకుపై గోవు కూడా చిత్రీకరించి ఉంది.
ఇక వెండినాణెములలో 97నాణెములు విడిగా లభించగా, 148 నాణెములు మూత గల ఇత్తడి పాత్రలో (మొత్తం 245) లభించాయి. అదేవిధంగా రాగినాణెము కూడా ఇత్తడి పాత్రలోనే లభించింది.
ఈ వెండినాణెములు 1800వ సంవత్సరం నుండి 1910 సంవత్సరం నాటివిగా (బ్రిటీష్ వారు మన దేశాన్ని పాలించిననాటివిగా) గుర్తించారు.
కాగా ఘంటామఠప్రాంగణములో ప్రధానాలయానికి ఎదురుగా అనగా నైరుతి మూలలో గల ఉపాలయపు గోడలో రాళ్ల మధ్య తామ్రశాసనములు, , వెండినాణెములు కనుగొన్నారు.
విషయము తెలిసిన వెంటనే కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులతో కలిసి ఘంటామఠం చేరుకున్నారు.
స్థానిక రెవెన్యూ, పోలీస్, తెలుగువిశ్వవిద్యాలయం వారికి, కర్నూలు పురావస్తుశాఖ కార్యాలయానికి సమాచారాన్ని తెలిపారు. తహశీల్దార్ బి.
రాజేంద్రసింగ్, స్థానిక పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ కె. హరిప్రసాద్, దేవస్థానం ఇంజనీరింగ్, భద్రతా విభాగపు అధికారుల సమక్షంలో రాగి రేకులు , నాణెములను వెలికి తీసి పంచనామ చేసి వివరాలను నమోదు చేసారు.
*Kumaraswamy puja,Nandheeshwara puja,Bayalu Veerabhadraswaamy puja performed by the archaka swaamulu. E.O. inspected the q lines.