ఘంటామఠం పునరుద్ధణ పనులలో బయటపడిన ధ్యానమందిరం

 శ్రీశైల దేవస్థానం:  ఘంటామఠం పునరుద్ధణ పనులలో  ధ్యానమందిరం  బయటపదింది. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా  శ్రీశైల దేవస్థానం పంచమఠాల జీర్ణోద్ధరణ పనులను చేపట్టింది. ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు.కాగా ఈ రోజు 24న  ఘంటామఠ పునర్నిర్మాణ పనులు జరిపిస్తుండగా ధ్యానమందిరం బయటపడింది.విషయము తెలిసిన వెంటనే కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులతో కలిసి ఘంటామఠం చేరుకుని ధ్యానమందిరాన్ని పరిశీలించారు.ఘంటామఠం ఆలయం ముందుభాగములోని కోనేరుకు ఉత్తరభాగాన ఈ ధ్యానమందిరం బయపడింది.ఈ ధ్యాన మందిరం సుమారు 6 అడుగుల 6 ఇంచుల విస్తీర్ణణాన్ని కలిగిఉంది. ధ్యానమందిరం నైరుతి భాగం నుండి ఆగ్నేయం వరకు,  ఆగ్నేయ మార్గం నుండి తూర్పు వరకు సొరంగ మార్గం ఉంది.ఈ ధ్యానమందిరాన్ని యథావిథిగా పునరుద్ధరణ పనులు చేస్తారు.

ఈ కార్యక్రమములో ఈఈ మురళీ బాలకృష్ణ,  పర్యవేక్షకులు శ్రీహరి, సహాయ స్థపతి ఐ.యు.వి జవహర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సురేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*Pallaki seva, uyala seva and Datthaathreya special puja performed in the temple.

*  BR Dattatreyagoud, Adoni, Kurnool Dt. donated  Rs.One lakh For Annadhaanam scheme in the temple.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.