
శ్రీశైలదేవస్థానం:ఈ రోజు (16.02.2021) న వసంత పంచమి పర్వదినం సందర్భంగా శ్రీశైల దేవస్థానం తరుపున కొలనుభారతి క్షేత్రంలో ని శ్రీసరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
కర్నూలు జిల్లా, కొత్తపల్లి మండలంలోని కొలను భారతి క్షేత్రాధి దేవత అయిన శ్రీ సరస్వతీ అమ్మవారికి ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున శ్రీశైల దేవస్థానం నుండి ఆనవాయితీగా పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు.
ఈ నాటి కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి కే ఎస్ .రామ రావు సంప్రదయబద్దంగా పట్టువస్త్రాలను తలపై ధరించి అర్చకస్వాములు మంత్రోచ్చారణతో ఆలయ ప్రవేశం చేసి అమ్మవారికి సమర్పించారు. పట్టు వస్త్రాలతో పాటు పసుపు,కుంకుమ, గాజులు, పలురకాల పుష్పాలు, ఫలాలు కూడా కొలనుభారతి క్షేత్రాధి దేవతకు సమర్పించారు.
పట్టువస్త్రాల సమర్పణ తరువాత అమ్మవారికి విశేషపూజాదికాలు జరిగాయి. అనంతరం కొలనుభారతి ఆలయం లో సామూహిక అక్షరభ్యాస కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు.కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసంతపంచమి రోజున శ్రీశైలదేవస్థానం తరుపున పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారన్నారు. మన దేవతా సమూహంలో సరస్వతీ దేవి విద్యాధిదేవతగా ఉందన్నారు . విద్యా, బుద్ధి, వాక్ప్రతిభ లను సరస్వతీదేవి అనుగ్రహిస్తుందన్నారు. అందుకే అక్షరభ్యాస సమయం లో విద్యాసిద్ధి కోసం సరస్వతి దేవిని పూజించడం సంప్రదాయమైందన్నారు. సంగీత సాహిత్యాలకు కూడా అధిష్ఠాత్రి అయిన ఈ దేవతను ఎందరెందరో కవులు తమ కావ్యాలలో విధిగా స్తుతించారన్నారు.
వసంత పంచమి పర్వదినమైన ఈ రోజున (16.02.2021) అమ్మవారి సన్నిధిలో అక్షరభ్యాసం జరుపుకున్న చిన్నారులందరికీ విద్యాబుద్ధులు అలవడి వారు మంచి ఉన్నతిని పొందాలని ఆకాంక్షించారు.
తరువాత అక్షరభ్యాసం పొందిన చిన్నారులందరికీ శ్రీశైల దేవస్థానం తరుపున లడ్డు ప్రసాదాలను అందించారు.
అనంతరం కొలను భారతి ఆలయం వద్ద దాతలు నిర్వహిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం లో కూడా కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు. ఈ సమర్పణలో కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావుతో పాటు స్వామివార్ల ఆలయ ప్రధానార్చకులు జె. వీరభద్రయ్యస్వామి, ఉపప్రధానార్చకులు శివప్రసాద్ స్వామి, అమ్మవారి అర్చకులు, ఎం. సత్యనారాయణ శర్మ, ఆలయ విభాగాపు సహాయ కార్యనిర్వహణాధికారి హరిదాసు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
- Kumaara Swamy Puuja , Bayalu Veerabhadra Swamy puuja, * Nandheeswara Puuja performed in the temple.