×

కేసీఆర్ హామీ నేరవేర్చేదాకా  ఉద్యమం-కె. విరాహత్ అలీ

కేసీఆర్ హామీ నేరవేర్చేదాకా  ఉద్యమం-కె. విరాహత్ అలీ

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇండ్లు, హెల్త్ కార్డులు, అందరికీ అక్రెడిటేషన్లు ఇస్తామని పలు సందర్భాలలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ నేరవేర్చేదాకా  తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని  టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ స్పష్టం చేసారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మూడవ దఫా పోరుబాటలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) పిలుపు మేరకు హెచ్.యూ.జే ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు భారీ ధర్నా నిర్వహించారు.  కె. విరాహత్ అలీ మాట్లాడుతూ  ఇప్పటి వరకు మూడు దఫాలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జర్నలిస్టుల ఆందోళన విజయవంతమై చరిత్ర సృష్టించిందన్నారు.  ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆందోళనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు.  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు నేడు తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు . ఐజేయూ సీనియర్ నాయకులు కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు గొంతెమ్మ కోర్కెలను కోరడం లేదని, గత ఎన్నికల సమయం లో అధికార టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చమంటున్నామని  అన్నారు. సచివాలయంలోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆంక్షలు విధించడం అనుచితమన్నారు.  హెచ్.యూజే కార్యదర్శి శిగ శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ ఆందోళనలో ఐజేయూ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, సిసిఐ సభ్యులు ఎం.ఎ మాజీద్, ఐజేయూ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, నాయకులు యాదగిరి, రాజేష్ ,రియాజ్ అహ్మద్, హబిబ్ జిలానీ, రాములు, వెంకటచారీ, డి. స్వామి, గౌస్, సుధాకర్, జునైద్, ఇబ్రహీం,చారి,గోపినాధ్,మల్లేష్,సాగర్,గిరిబాబు,వినయ్,శ్రీనివాస్,సత్యం, తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు అనిల్ కుమార్, నక్క శ్రీనివాస్శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మానిక్ రాజ్ కు వినతి పత్రాన్ని అందజేశారు.తోటి కార్మికులకు మేలు జరగాలనే లక్ష్యంతో తమ ప్రాణాలను బలిదానం చేసిన ఆర్టీసీ కార్మికులకు నివాళులర్పిస్తూ జర్నలిస్టులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకై జరుగుతున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీయూడబ్ల్యూజే, ఐజేయూ నాయకులు ప్రకటించారు.

print

Post Comment

You May Have Missed