కృత్తికానక్షత్రం  సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

 శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం కృత్తికానక్షత్రం  సందర్భంగా  దేవస్థానం ఈ రోజు (23.01.2021) ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను నిర్వహించారు.ప్రతి మంగళవారం,  కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం ,పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారి సేవగా) నిర్వహిస్తారు. కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి.సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో ఎటువంటి శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టిదోషాలు మొదలైనవి తొలగిపోతాయి.  సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందనినమ్మకం.

ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతివైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని,జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు నుహాగణపతి పూజ జరిపి, అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, సుబ్రహ్మణ్య అష్టోత్తరము,  సుబ్రహ్మణ్యస్తోత్రము పారాయణలు చేశారు.సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు,తేనే,నెయ్యి, కొబ్బరినీళ్లు,  వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా వివిధ పళ్ల రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.

*బాల వెట్టి  నిర్మూలనకు  శ్రీశైలంలో వివిధ శాఖల సమన్వయంతో జరిగిన స్పెషల్ డ్రైవ్.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.