కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాల నిరుద్యోగ యువత కోసం వచ్చే వారం మెగా జాబ్ మేళా నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు నిర్ణయించారు.రిజర్వాయర్ల ఖిల్లా అయిన సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి, అనంతగిరి, కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్ల నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో ముంపునకు గురవుతున్న గ్రామ ప్రజలకు మెగా ఉద్యోగ జాబ్ మేళాను నిర్వహించ తలపెట్టినట్లు మంత్రి చెప్పారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ చాంబర్లో శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి. వెంకట రామారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఫిఫ్త్ రీచ్ స్ట్రాటెజిక్ సొల్యూషన్ మిస్టరజి జి మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ షాబుద్దీన్ తో కలిసి జాబ్ మేళా నిర్వహించాల్సిన అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లాలో ముంపునకు గురవుతున్న గ్రామాలలోని ప్రజల కోసం మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా ముంపు ప్రాంతాలలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా, ఆయా ఉద్యోగాలకు ఎంపిక అయ్యేందుకు కావాల్సిన అర్హతలు సాధించేలా శిక్షణను సైతం ఇప్పించేలా మంత్రి హరీష్ రావు చొరవతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వెంకట రామారెడ్డి, అలాగే సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో ఈ జాబ్మేళాను చేపట్టనున్నారు. ఈ మెగా జాబ్ మేళాను వచ్చేవారం నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ ప్రైవేటు కంపెనీలైన టాటా, న్యాక్, నవయువ, డిఆర్డిఎ వారి సహకారంతో పాటు ఇతర ప్రైవేటు కంపెనీల సౌజన్యంతో ఆయా ముంపు ప్రాంతాలలోని యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా డిప్లొమా పీజీ పాలిటెక్నిక్ తదితర ఉత్తర వాటిలో ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్లు ఆయన తెలిపారు.