కర్నూల్ లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు

కర్నూల్లో ట్రాఫిక్ నియంత్రణకు మరిన్ని చర్యలు అవసరమని అధికారులు భావిస్తున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నగరంలోని పోలీసు అధికారులతో ట్రాఫిక్ క్రమబద్దీకరణపై జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి సమావేశం నిర్వహించారు.  పట్టణ డిఎస్పీ ఖాదర్ బాషా ,  ట్రాఫిక్ డిఎస్పీ  సి. ఎమ్ గంగయ్య తదితరులతో మాట్లాడి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు ఎస్పీ  గోపినాథ్ జెట్టి , ఎమ్మెల్యె ఎస్వీ మోహన్ రెడ్డి,  మున్సిపల్ కమిషనర్  హరినాథ్ రెడ్డి కలిసి  జిల్లా పోలీసు కార్యాలయంలో మొక్కలు నాటారు.  మార్కెట్ యార్డు, కొత్తపేట దగ్గర ఉన్న పాత క్వాటర్స్ లకు వెళ్ళి అక్కడ ఉన్న డ్రైనేజీ , వాటర్ ట్యాంకుల సమస్యలను పరిశీలించారు. క్వాటర్స్ ల చుట్టూ  ప్రహరీ గోడ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తామన్నారు.     త్వరలో పోలీసు క్వాటర్స్ ల పరిసరాలలో స్వచ్చభారత్ నిర్వహిస్తామన్నారు.  ముఖ్యమైన రద్దీ ప్రాంతాలైన  రాజ్ విహార్, కిడ్స్ వరల్డ్ , ఎన్ టి ఆర్ సర్కిల్,   ప్రభుత్వ ఆసుపత్రి, సి.క్యాంప్ , బళ్ళారి చౌరస్తా, కొత్త బస్టాండ్ తదితర సర్కిళ్ళలో ట్రాఫిక్  నియంత్రణ కు ఏ చర్యలు తీసుకోవాలో చర్చించామన్నారు. ఎమ్మెల్యే , మున్సిపల్ కమీషనర్  స్పందించి తగిన పనులను  పూర్తి చేయిస్తామని తెలిపారు. రద్దీ ప్రాంతాలలో పార్కింగ్ స్ధలాలను ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు వెడల్పు చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.  సమన్వయంతో కలిసి పని చేస్తామన్నారు.  ఎఆర్ అడిషనల్ ఎస్పీ  ఐ. వెంకటేష్, డిఎస్పీలు ,   సి. ఎమ్. గంగయ్య,  బాషా, జె.బాబుప్రసాద్, సిఐలు  డేగల ప్రభాకర్,  నాగారాజా రావు,  ఆర్ ఐ రంగముని , పోలీసు సంఘం అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఎస్సైలు  ఉన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.