ఏపీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంపు
ఏలూరు: వింత వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటి సీఎం ఆళ్లనాని బుధవారం ఉదయం పర్యటించారు. ఏలూరులో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలు, శానిటేషన్ పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మూర్ఛ వ్యాధితో బాధపడే రోగులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యశ్రీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Post Comment