ఎస్ ఓ టీ   పోలీసుల దాడులు – తంబాకు పాకెట్లు స్వాధీనం

ఎస్ ఓ టీ   పోలీసులు దాడులు నిర్వహించారు . ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  ధనలక్ష్మి నగర్ లో వ్యాపారి  బాలరాజు(39) ఇంట్లో అక్రమంగా నిల్వ చేసారన్న  ఆరోపణపై    తంబాకు పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు . ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసారు . స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. మూడు లక్షలు ఉంటుందని అంచనా.

 దారుణ హత్య:

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సత్తి తండాకు చెందిన నెనవత్ రాజు(26) దారుణ హత్యకు గురయ్యాడు.
గుర్రంగుడా వద్ద విపసన్న ధ్యాన కేంద్రం వెళ్లే రహదారి పక్కన అటవీప్రాంతంలో మృతదేహం కనిపించిందని  సరూర్ నగర్ పోలీసులు తెలిపారు.   దారుణంగా చంపి  పడేసారని బంధువుల ఆరోపణ.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.