గజ్వేల్ మహిళాడిగ్రీ కాలేజీలోని ఎన్. ఎస్. ఎస్. విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సుమారు 2 వందల మంది విద్యార్థినులు కొత్త ఓటర్లుగా తమ పేర్లను నమోదుకు దరఖాస్తు ఫారాలను రాశారు. ఓటు హక్కు పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాలేజీ ప్రిన్సిపాల్ ఉమాశశి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపక, ఎం ఎస్ ఎస్ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. – చైతన్య, గజ్వేల్