×

ఆర్థిక, అక్షరాస్యత అంశంపై సెమినార్

ఆర్థిక, అక్షరాస్యత అంశంపై సెమినార్

*రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎ.జి .ఎం. వెంకటేష్ కు జ్ఞాపికను అందిస్తున్న గజ్వేల్ ప్రభుత్వ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.వేంకటేశ్వర రావు.

*ఆర్బీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆర్థిక అక్షరాస్యత సెమినార్ కు హాజరైన డిగ్రీ, పీజీ కాలేజీల విద్యార్థులు.

గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ,పీజీ కాలేజీ ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆర్థిక అక్షరాస్యత అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. హైదరాబాద్ లోని ఆర్బీఐ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ సెమినార్ కు ఆర్బీఐ ఏజీ ఎం వెంకటేష్, మేనేజర్ శ్రీధర్, అసిస్టెంట్ మేనేజర్ కెవీఎల్ ఎన్ మూర్తి హాజరయ్యారు. బ్యాంకుల్లో సాగే ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ లావాదేవీలతో పాటు ఎదురయ్యే సమస్యలపై కూడా విద్యార్థులకు ఆర్బీఐ అధికారులు అవగాహన కల్పించారు.ఈ సెమినార్ కు పట్టణంలోని పలు డిగ్రీ కాలేజీలకు చెందిన విద్యార్థులు హాజరై వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ,పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.వేంకటేశ్వర రావు, వైస్ ప్రిన్సిపాల్ రాజు,ఆర్థిక శాస్త్ర విభాగం అధ్యాపకులు డా.కరుణ, డా.బాలచంద్రం, ఇతర కాలేజీల అధ్యాపకులు పాల్గొన్నారు.- చైతన్య, గజ్వేల్.

print

Post Comment

You May Have Missed