×

ఆబ్కారీ  మంత్రి పద్మారావు, తెరాస నేతల పై కేసులు  కొట్టివేత

ఆబ్కారీ  మంత్రి పద్మారావు, తెరాస నేతల పై కేసులు  కొట్టివేత

          హైదరాబాద్, జూలై 4, రాష్ట్ర అబ్కారి, క్రీడల మంత్రి టీ.పద్మారావు గౌడ్ తో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన తెరాస నేతల పై దాఖలైన ఎన్నికల కేసులను న్యాయస్థానం కొట్టి వేసింది.   2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం సికింద్రాబాద్ నియోజకవర్గ తెరాస అభ్యర్ధి టీ.పద్మారావుతో పాటు పలువురు తెరాస నేతల పై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులను నమోదు చేసింది.    ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ కు మంత్రి పద్మారావు గౌడ్ తదితరులు బుధవారం నాంపల్లి లోని  జిల్లా కోర్టుకు  హాజరయ్యారు.   కేసు పూర్వపరాలను  విచారించిన జిల్లా మెట్రోపాలిటిన్  న్యాయస్థానం ఈ  కేసులను కొట్టివేసింది.  తెరాస నేతల  పక్షాన న్యాయవాది సంతోష్ రెడ్డి కోర్టులో తమ వాదనలను వినిపించారు.

print

Post Comment

You May Have Missed