
*Mouli, Machilipatnam
ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాజరిగింది .అప్పుల ఊబిలో కూరుకుని, వచ్చే ఆదాయం చాలక జిల్లాలో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారని ధర్నాకు దిగిన వారు ఆవేదన వ్యక్తం చేసారు. గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో 2015 సంవత్సరంలో చేనేత కార్మికులు పలువురు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు ,. ఇలాంటి దారుణాలు జరిగి మూడు ఏళ్ళు అవుతున్నా బాధ్యులు స్పందించడం లేదన్నారు. వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు.