
కర్నూలు: జిల్లాలో కోవిడ్ హాస్పిటల్లో బెడ్ మీద వైద్య చికిత్సలు పొందుతున్న కరోన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్సిజన్ కొరత రానీయకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జేసీ (రెవెన్యూ), ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి హాస్పిటల్ మేనేజ్మెంట్, ఆక్సిజన్ నోడల్ కమిటీ అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం స్థానిక జెసి (రెవెన్యూ), జిల్లా ఇంఛార్జి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి హాస్పిటల్ మేనేజ్మెంట్, ఆక్సిజన్ మేనేజ్మెంట్ కమిటీ అధికారులతో జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జెసి (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ రమణయ్య, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం సోమశేఖర్ రెడ్డి, చీఫ్ మెడికో ఆరోగ్యశ్రీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఇలియాస్ భాష, డేటా మేనేజ్మెంట్ నోడల్ అధికారి సత్యప్రకాశ్, ఏపీఎంఐడిసి సదాశివ రెడ్డి, డ్రగ్ కంట్రోలర్ ఏడి చంద్రశేఖర్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్, హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు ఆక్సిజన్ మేనేజ్మెంట్ నోడల్ కమిటీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్.రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ బాధితులకు కోవిడ్ -19 వైద్య చికిత్సలో అత్యంత కీలకమైన సహాయకారి అయిన ఆక్సిజన్ అవసరములో భాగంగా అవసరం లేకున్నా ఆక్సిజన్ ఇస్తూ దుర్వినియోగం చేస్తున్నారని, అవసరం ఉన్న వాళ్లకు మాత్రమే ఆక్సిజన్ ఇవ్వాలని, హాస్పిటల్ లో ఉన్న బెడ్ కెపాసిటీ ప్రకారం ఎంత ఆక్సిజన్ ఇవ్వగలమో అంతే ఇవ్వడం జరుగుతుందని, ఆక్సిజన్ దుర్వినియోగం చేయొద్దని ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అధికారులకు ఆదేశించారు. ఆరోగ్య శ్రీ హాస్పిటల్ లో కోవిడ్ పేషెంట్లకు 50 శాతం ఐసియు బెడ్స్, నాన్ ఐసియు బెడ్స్ కేటాయించాలని… కేటాయించక పోతే సంబంధిత ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్ కు ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. ఆక్సిజన్ వాడకం… దుర్వినియోగం… ఆక్సిజన్ సప్లై పై ఆక్సిజన్ కమిటీ అధికారులు మానిటరింగ్ చేయాలన్నారు. హాస్పిటల్లో ప్రతి పేషెంట్ కు ఎంత ఆక్సిజన్ ఇస్తున్నాం… ఎంత వినియోగించం… కోవిడ్ రోగుల ఆరోగ్య పరిస్థితి, అందించిన వైద్య సేవలపై ప్రతిరోజు నివేదిక అందించాలన్నారు. జిల్లాలో మొత్తం ఆక్సిజన్ అవసరం ఎంత, మనం ఎంత వాడుతున్నాం, ఆక్సిజన్ ఎక్కడ నుంచి వస్తోంది, ఆక్సిజన్ తీసుకొస్తున్న వాహనాల మూమెంట్ ఎలా ఉంది, ప్రతి హాస్పిటల్ కు ఎంత ఆక్సిజన్ అవసరం, ఎంత వెళ్ళాలి, ఎంత వెళ్తోంది తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షణ చేయాలని జిల్లా పరిశ్రమల శాఖ జిఎం సోమశేఖర్ రెడ్డికి ఆదేశించారు. ప్రైవేట్ హాస్పిటల్ లో నుంచి ఆక్సిజన్ బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యేక నిఘా ఉంచాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ మరియు పోలీసులకు ఆదేశించారు. ప్రతిరోజు కరోనా బాధితులకు ఎంత మేర ఆక్సిజన్ ఇచ్చామో… ఎంత వినియోగించమో తప్పకుండా ఆక్సిజన్ ఆడిట్ చేయించాలన్నారు. జిల్లాకు ఆక్సిజన్ తో వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ తో పాటు ప్రత్యేక పోలీసు బందోబస్తు గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు కృషి చేయాలని పోలీస్ అధికారులకు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆదేశించారు. ఆక్సిజన్ ఎంత వినియోగించం, ఎంతో అవసరం తదితర వివరాలను డైలీ అప్ డేట్ చేయాలని డేటా మేనేజ్మెంట్ నోడల్ అధికారి సత్య ప్రకాష్ , పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ రమణయ్యకు ఆదేశించారు. అంతకుముందు కోవిడ్ హాస్పిటల్ వారిగా హాస్పిటల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులతో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, జెసి (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూల్ నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె. బాలాజీ లు సమీక్షించారు.