అధ్యయనోత్సవాల వైభవం- అహోబిలంలో అధ్యయన ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి .
అన్ని వైష్ణవ క్షేత్రములలో ముఖ్యమైన ఉత్సవం అధ్యయనోత్సవం.అధ్యయనోత్సవాలలో ఆళ్వార్ పాశురములను స్వామికి విన్నవిస్తారు.అన్ని వైష్ణవ క్షేత్రములకన్నా ముందు అహోబిలంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి.
అసలు ఆళ్వార్ పాశురాలు స్వామికి విన్నవించాల్సిన అవసరం ఏముంది?
ఆముక్తమాల్యదలో శ్రీ కృష్ణదేవరాయలు పై ప్రశ్నకు ఇలా సమాధానం చెబుతున్నారు……
“అలపన్నిద్దఱు సురులందును సముద్యల్లీలగా పన్నవెగ్గల ప్రందాపము బాపునా నిజమనః కంజాత సంజాతపుష్కలమాధ్వీకఝరి న్మురారి నొగియంగా జొక్కి ధన్యాత్ములౌనిల పన్నిద్దఱుసూరులం దలతు మోక్షేచ్ఛామతిం దివ్యులన్.”
మోక్షమును కాంక్షిస్తూ ఆళ్వార్ల శ్రీ సూక్తిని, ఆళ్వార్లను స్మరిస్తూ స్వామికి విన్నవించాలి.
అయితే స్వామికి ఆళ్వార్ శ్రీ సూక్తి వినవలసిన అవసరం ఏమంటే….
శ్రీమన్నారాయణుడు సూర్య మండలం మధ్యలో కొలువైయున్నారు.సూర్య మండల మధ్యలో కొలువైయుండడం చేత ఏర్పడే తాపాన్ని ఆళ్వార్ల అమృత తుల్యమైన సూక్తులను విని స్వామి తొలగించుకుంటున్నారు.
Why alwar paasurams are recited before perumal?
Sri krishna Deva raya,
in his Amukthamalyada answers above question like this……
నిజమనః కంజాత సంజాతపుష్కలమాధ్వీకఝరి న్మురారి నొగియంగా జొక్కి ధన్యాత్ములౌనిల పన్నిద్దఱుసూరులం దలతు మోక్షేచ్ఛామతిం దివ్యులన్.”
Perumal is in surya mandalam.He is suffering from heat of sun .To cool himself from bhanuthapam he hears alwar sreesukthi.
We have to recite alwar paasurams to get moksham… courtesy:kidambi sethu raman