
శ్రీశైల దేవస్థానం: ఈ రోజు(12.03.2021) న సాయంకాలం స్వామి అమ్మవార్ల రథోత్సవం అలరించింది. రథోత్సవంలో సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలికార్యక్రమాలుజరిగాయి. రథాంగబలిలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నంరాశి) సాత్వికబలిగా సమర్పించారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లను రథంపైకి వేంచేబు చేయించి రథోత్సవం జరిపారు.ఈ రథోత్సవ దర్శనం వలన సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. రథోత్సవాన్ని పురస్కరించుకొని బంతి,చామంతి, గులాబీలు, కాగడాలు, కనకాంబరాలు, చాందిని, గ్లాడియోలస్, కార్నియా, ఆస్టర్స్, మొదలైన 11 రకాల పుష్పాలతో రథాన్ని అలంకరించారు. అర్చక స్వాములు , ఈ ఓ కే ఎస్.రామ రావు ఇతర అధికార, సిబ్బంది పాల్గొన్నారు. అశేష జనవాహిని మధ్య ఈ ఉత్సవం జరిగింది.