- చరిత్రలో ఈరోజు సువర్ణఅక్షరాలతో లిఖించదగింది
- నేడు తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు పండగ రోజు
- నాలుగేళ్లలో సిఎం కేసిఆర్ చేపట్టిన పథకాలకు దేశవ్యాప్త ప్రశంసలు
- నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అన్నదే సిఎం కేసిఆర్ స్వప్నం…
- జెట్ వేగంతో ప్రాజెక్టుల నిర్మాణం…రాక్షసుల్లా అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేతలు
- వరంగల్ లో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
- నీటి తీరువా బకాయిలు మాఫీ చేసినందుకు సిఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
వరంగల్, మే 10 : ‘‘ చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగింది. తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి పండగ రోజు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచని, ఊహించని పథకం. ఈ పథకంతో సిఎం కేసిఆర్ దేశంలో, రాష్ట్రాల్లో చరిత్ర సృష్టించారు. కొత్త చరిత్రకు నాంది పలికారు’’ అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతును రాజు చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ గొప్ప ఆశయంతో తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలోనిరాయపర్తి మండలం, కొత్తూరు గ్రామంలో, వర్ధన్నపేట నియోజకవర్గం, ఐనవోలు మండలం, సింగారం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి, చెక్కులను అందించారు. రైతుల కోసం నీటి తీరువా బకాయిలు దాదాపు 800 కోట్ల రూపాయలను మాఫీ చేసినందుకు సిఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఆరు దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగ ఫలితం, సిఎం కేసిఆర్ నాయకత్వంలో ఎంతో కష్టపడి తెచ్చుకున్నతెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకునేందుకు సిఎం కేసిఆర్ అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని చెప్పారు. గత నాలుగేళ్లలోనే తన పరిపాలన దక్షతతో చేపట్టిన పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని తెలిపారు. అందరి దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు వ్యవసాయం పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నారు. రైతులకు కనీసం నాలుగుగంటలు కూడా కరెంటు రాక, విత్తనాలు, ఎరువులు దొరకక చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చేసేవాళ్లన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక పార్టీ మేనిఫెస్టో రూపొందించే కమిటీకి కేసిఆర్ గారు నన్ను చైర్మన్ గా చేశారు. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ ను వ్యవసాయానికి ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చాలన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఎలా ఇస్తారని, ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని, పంపిణీ పెంచాలని అవి పెరగకుండా సాధ్యం కాదని, మరొకసారి దీనిపై ఆలోచించాలని సిఎం కేసిఆర్ ను తాను కోరానని చెప్పారు. అయితే మనసుంటే కచ్చితంగా సాధ్యమేనని దీనిని మేనిఫెస్టోలో పెట్టమని సూచించారని చెప్పారు. అయితే ఈ నాలుగేళ్లలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు 24 గంటలు ఉచిత విద్యుత్ అందించే ఏకైక రాష్ట్రంగా తెలంగాణను దేశంలో నిలబెట్టారని చెప్పారు. అదేవిధంగా రైతులకు లక్ష రూపాయలలోపు పంట రుణాల మాఫీని కూడా మేనిఫెస్టోలో పెట్టాలన్నప్పుడు తనకు భయమైందని, కనీసం 20, 25వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని సిఎం కేసిఆర్ కు వివరించానని చెప్పారు. అయితే కేసిఆర్ గారు ఏదేమైనా లక్ష రూపాయలలోపు పంటరుణాలు మాఫీ చేయాల్సిందేనని చెప్పి దానిని కూడా మేనిఫెస్టోలో పెట్టించారని తెలిపారు. పంట రుణాలను నాలుగు విడతలుగా 17వేల కోట్ల రూపాయలు మాఫీ చేశారని, దీనివల్ల 38 లక్షల మంది రైతులు లబ్ది పొందారని చెప్పారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క రైతు కూడా ఎరువులు, విత్తనాల కోసం క్యూలైన్లలో నిలబడలేదన్నారు. ఇక నా తెలంగాణ కోటి రతణాల వీణ అని దాశరథి అంటే…నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణా అని సిఎం కేసిఆర్ అన్నారు. దీనిని నిజం చేసేందుకు ప్రాజెక్టులను జెట్ వేగంతో నిర్మిస్తున్నారు. నేడు కాళేశ్వరం, దేవాదుల పనుల వేగం చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారని చెప్పారు. అయితే కొంతమంది ప్రతిపక్ష నేతలు రాక్షసుల్లా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని, వీరెవరిని లెక్క చేయకుండా ప్రాజెక్టులలో ముందుకెళ్తున్నామని చెప్పారు. రైతుకు కరెంటు, నీళ్లు, విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు మాఫీ చేస్తే సరిపోదని భావించిన సిఎం కేసిఆర్ ఇప్పుడు పంట పెట్టుబడి కోసం ఎకరానికి ఏటా 8000 రూపాయలు అందించే రైతు బంధు పథకాన్ని నేడు ప్రారంభించడం దేశ చరిత్రలో కొత్త అధ్యయనానికి తెర తీసిందన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్నిరకాల పథకాలు అమలు చేస్తున్న ఏకైక సిఎం కేసిఆర్ అన్నారు