శ్రీశైల దేవస్థానం:
కార్తీక మాసోత్సవాల సన్నాహక సమావేశం
• అక్టోబరు 22 నుంచి నవంబరు 21 వరకు కార్తీక మాసోత్సవాలు
భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
పాతాళగంగవద్ద పుణ్యస్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు
• అక్టోబరు 24 కార్తీక మొదటి శుక్రవారం రోజున పాతాళగంగ వద్ద కృష్ణమ్మ హారతి
• నవంబరు 1 కార్తీక శుద్ధ ఏకాదశిరోజున గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం
• కార్తీకమాసంలోని సోమవారాలలో లక్షదీపోత్సవం- పుష్కరిణి హారతి
. కార్తీకమాసమంతా గర్భాలయ అభిషేకాలు నిలుపుదల
. కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం, లక్షదీపోత్సవం- పుష్కరిణి హారతి,
అక్టోబరు 22 నుంచి నవంబరు 21 వతేదీ వరకు కార్తీకమాసోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి సోమవారం పరిపాలనా భవనంలోని
సమావేశ మందిరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ, ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యంగా ఈ సమావేశంలో భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం,
ఆలయ వేళలు, శ్రీస్వామిఅమ్మవార్ల ఆర్జితసేవలు, క్యూలైన్ల నిర్వహణ, రద్దీ క్రమబద్దీకరణ, ట్రాఫిక్
క్రమబద్దీకరణ, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, కార్తీక సోమవారాలు, మొదటి శుక్రవారం రోజున
కృష్ణమ్మకు హారతి, శుద్ధ ఏకాదశిరోజున కోటి దీపోత్సవం, లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి,
కార్తీకపౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం మరియు పుణ్యనదీహారతి ఏర్పాట్లు, కార్తీకమాసంలో
ఆకాశదీపం ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ మొదలైన అంశాలను గురించి సుదీర్ఘంగా
చర్చించారు.
సమావేశంలో ముందుగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్తీక
మాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని
విభాగాలను ఆదేశించారు.ఆయా ఏర్పాట్లన్నీ కూడా ముందస్తుగా పూర్తి కావాలని అన్నారు. అక్టోబరు 15వతేదీకంతా
ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని అన్నివిభాగాల అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీకపౌర్ణమి, శుద్ధ ఏకాదశి మరియు ప్రభుత్వ
సెలవురోజులలో భక్తులరద్దీ అధికంగా ఉంటుందని చెబుతూ రద్దీకనుగుణంగా ఆయా ఏర్పాట్లన్నీ
పకడ్బందీగా చేపట్టాలన్నారు. పాతాళగంగవద్ద శౌచాలయాలకు, స్త్రీలు దుస్తులు మార్చుకునే
గదులకు మరియు పాతాళగంగ మెట్లమార్గం మొదలైన చోట్ల అవసరమైన మరమ్మతులను వెంటనే
చేపట్టాలన్నారు.అదేవిధంగా గంగాభవానీ స్నానఘట్టాలకు కూడా అవసరమైన మరమ్మతులను
చేయించాలన్నారు.
సమావేశంలో ఈ క్రింది అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
సిబ్బందికి ప్రత్యేక విధులు :
భక్తులకు సేవలు అందించేందుకుగాను కార్తీక మాసంలో రద్దీరోజులందు కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక
విధులు.
దర్శనం ఏర్పాట్లు :
• వేకువ జామున గం.3.00లకు ఆలయ ద్వారాలు తెరచి, ప్రాతఃకాల పూజల అనంతరం వేకువజామున
గం. 4.30ల నుంచి సాయంకాలం గం.4.00ల వరకు దర్శనాలు . అదేవిధంగా
తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచి రాత్రి గం.10.30ల వరకు దర్శనాలు కొనసాగుతాయి.
ఆర్జితసేవలు :
కార్తీక మాసమంతా కూడా శ్రీస్వామివారి గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల.
సామన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీకమాస శని,
ఆది,సోమవారాలు, పౌర్ణమి మొదలైన పర్వదినాలలో (మొత్తం 15 రోజులలో) సామూహిక అభిషేకాలు
కూడా పూర్తిగా నిలుపుదల .
తక్కిన సాధారణరోజులలో సామూహిక అభిషేకాలు పరిమితంగా నిర్వహిస్తారు.
అన్నప్రసాదాల వితరణ :
• భక్తులకు అన్న ప్రసాద వితరణ భవనములో ఉదయం గం.10.45ల నుండి అన్నప్రసాదాల వితరణ
.
సాయంత్రం గం. 7.00ల నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు.
. క్యూకాంప్లెక్స్లో దర్శనానికి వేచి ఉండే భక్తులకు మంచి నీరు, బిస్కెట్లు, అల్పాహారం
.
. అదేవిధంగా రద్దీ అధికంగా ఉన్న రోజులలో ఉదయం వేళలో వేడిపాలు .
. ముఖ్యంగా భక్తులరద్దీకనుగుణంగా కేశఖండనశాల వేళలను నిర్ధారించడం జరుగుతుంది.
సూచిక బోర్డుల ఏర్పాట్లు :
భక్తులు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా అవసరమైన అన్ని ప్రదేశాలలో తగినన్నీ
సూచిక బోర్డులు ఏర్పాటు.
కార్తీకమాసం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలు :
• లోకకల్యాణం కొరకు కార్తికమాసంలో అఖండ శివభజనలు.
కార్తీకదీపారాధన
. భక్తులు కార్తీకదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధీ ప్రత్యేక ఏర్పాట్లు
• అదేవిధంగా ఆలయ ముందుభాగంలోని గంగాధరమండపం వద్ద కూడా దీపారాధనకు ఏర్పాట్లు
.
కృష్ణమ్మ హారతి
నవంబరు 24, కార్తీక మొదటి శుక్రవారం రోజున పాతాళగంగ వద్ద కృష్ణమ్మహారతి కార్యక్రమం
లో నదీమతల్లికి విశేషపూజాదికాలు, సారె సమర్పణ
కోటి దీపోత్సవం :
నవంబరు 1, కార్తీక శుద్ధ ఏకాదశిరోజున గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం
.
ఈ దీపోత్సవానికి గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు ప్రత్యేక ఏర్పాట్లు
పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం , పుష్కరిణి హారతి:
కార్తీక సోమవారాలు మరియు పౌర్ణమిరోజున ఎప్పటి వలనే ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం
మరియు పుష్కరిణి హారతి కార్యక్రమాలు .
అదేవిధంగా గంగాధరమండపం వద్ద జ్వాలాతోరణ కార్యక్రమం .
సాంస్కృతిక కార్యక్రమాలు
• ఆలయ నిత్యకళావేదిక వద్ద ప్రతిరోజు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు .
లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి రోజులలో పుష్కరిణి వద్ద ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు
చేస్తారు
