మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నస్పూర్లోని షిర్కే కాలనీలో సింగరేణి క్వార్టర్లను పరిశీలించారు. మణుగూరు ఏరియాలో కొండపురం, రాంపూర్ షాప్ట్బ్యాక్, కేకే-6 ఇంక్లెయిన్, కాశిపేట-2 ఇంక్లెయిన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేటీకే-3, 5 ఇంక్లెయిన్లకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీరాంపూర్లో సింగరేణి కార్మికుల ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.