శ్రీశైలం నుంచి ధర్మ ప్రచార రథం శనివారం బయలుదేరింది . అంతకుముందు గంగాధర మండపం వద్ద రథంలో వేంచేసి ఉన్న స్వామి అమ్మవార్లకు , దేవతామూర్తులకు విశేష పూజలు జరిగాయి . అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఆదివారం ఈ రథం ద్వారా ధర్మ ప్రచారం చేపడుతారు . ఉదయం ధర్మ ప్రచారం, సాయంత్రం స్వామి అమ్మవార్లకు కల్యాణం నిర్వహిస్తారు .