శ్రీశైలం దేవస్థానం కళారాధన లో శనివారం బుర్రకథ, భక్తి రంజని కార్యక్రమాలు జరిగాయి .హైదరాబాద్ కు చెందిన డా. రాజేశ్వరి సుబ్రహ్మణ్యం బృందం భక్తి రంజని సమర్పించింది .వయోలిన్ సహకారాన్ని శ్రీమతి రత్నమాల , తబలా సహకారాన్ని గంగాధర్ అందించారు. కర్నూలు జిల్లా గడివేముల కు చెందిన రాజశేఖర్ బృందం శివపార్వతుల కల్యాణం బుర్రకథ సమర్పించారు . ఏ .రామకృష్ణ హాస్యం అందించగా ,టి .బాలుడు రెండో వంతగా వ్యవహరించారు .