శ్రీశైలంలో శాస్త్రోక్తంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి . అర్చక స్వాములు, వేదపండితులు సంయుక్తంగా ఈ పూజలు ప్రారంభించారు . శ్రీ స్వామి వారి యాగశాలలో ఆహ్లాదకర , చక్కని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభ మయ్యాయి. వివిధ పూజలు నిర్వహించారు .వేద పండితులు సహకరించారు . అధికారులు సమన్వయం చేసారు . ముందుగా మహాగణపతి పూజ జరిపారు . అర్చకులు , వేదపండితులు లోకకల్యాణం కోసం సంకల్పం చెప్పారు . పూజలు జరిపి కంకణాలు ధరించారు . వీరికి దీక్ష వస్త్రాలు అందించారు . అఖండ దీపాన్ని వెలిగించారు . పుణ్యా హ వచనం చేసారు.వివిధ పూజల అనంతరం శాస్త్రోక్తంగా రుద్రకలశ స్థాపన చేసారు . శ్రీ అమ్మవారి ఆలయంలో పూజలు జరిగాయి .
. వివిధ చోట్ల భక్తులకు మంచినీరు , మజ్జిగ , అల్పాహారం అందిస్తున్నారు . కర్ణాటక భక్త బృందం సహకారంతో వివిధ చోట్ల అన్నప్రసాద వితరణ జరుగుతోంది . గురువారం సాయంత్రం పలు పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి .