శ్రీశైలం పాతాళగంగ మార్గంలోని శ్రీ ప్రసన్నాంజనేయ ఆలయంలో గురువారం శ్రీ హనుమజ్జయంతి భక్తి ప్రపత్తులతో నిర్వహించారు . ఈ రోజు విశేష పూజలు జరిపారు . ఈ లోకం సుఖ శాంతులతో వర్ధిల్లాలని వేద పండితులు , అర్చక స్వాములు సంకల్పాన్ని చెప్పారు . అనంతరం మహా గణపతి పూజ జరిపారు . అనంతరం శ్రీ హనుమంతుల వారికి పంచామృతాభిషేకం , మన్యుసూక్తం తో జలాభిషేకం నిర్వహించారు. శ్రీ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు . ఆకుపూజ, పుష్పార్చన జరిపారు . భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు .