
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరో రోజు (09.03.2021) న శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలుజరిగాయి.తరువాత యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు చేసారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపారు. ఈ సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపారు.
పుష్పపల్లకీ సేవ:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు (09.03.2021) రాత్రి శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పపల్లకీ సేవ మనోహరంగా జరిగింది.
ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో వేంచేబు చేయించి ప్రత్యేక పూజలు చేసారు. వివిధ పుష్పాలతో అలంకరించిన పుష్పపల్లకి ,మేళతాళాలతో శ్రీ స్వామి అమ్మవార్లను తోడ్కొని వచ్చి ఊరేగింపు నిర్వహించారు.
ఈ విశేష సేవలో ఎర్రబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, పసుపు చేమంతి, కనకాంబరాలు, డచ్ రోస్, అశోక పత్రాల మాలమాల, కాగడాలు, గ్లాడియేలస్, అస్పెర్ గ్రాస్,జబ్రా, కార్నేషన్, ఆర్కిడ్స్, నందివర్ధనం, గరుడవర్ధనం మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించారు.
పురాణాలలో శ్రీశైల మల్లికార్జున స్వామివారు పుష్పప్రియుడని ఈ కారణంగానే ఆయా కైంకర్యాలన్నీ శ్రీ స్వామివారికి పరిపూర్ణంగా అర్పింపజేయాలనే భావనతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ, సంక్రాంతి మహోత్సవాలలోనూ,దసరా మహోత్సవాలలోనూ ఈ పుష్పపల్లకి సేవ నిర్వహిస్తున్నారు.
*వివిధ వేదికలపై కళాకారులు సాంస్కృతిక వైభవం ప్రదర్శించారు.ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళారాధన వేదిక , పుష్కరిణి వేదిక , శివదీక్షా శిబిరాల వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించారు.
• సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం ఘనంగా జరిగింది .• గ్రామోత్సవంలో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది .