
శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 04.03.2021 నుండి 14.03.2021 వరకు 11 రోజులపాటు నిర్వహించనున్న సందర్భంగా
ఈ ఉత్సవాలకు వివిధ ఏర్పాట్లను చేస్తున్నారు.ఇందులో భాగంగా ఈ రోజు (13.02.2021) న కార్యనిర్వహణాధికారి కే ఎస్ రామ రావు శిఖరేశ్వర ఆలయం వద్ద చేయవలసిన పనులను పరిశీలించారు. శిఖరేశ్వర ఆలయ ముఖమండంపై భాగంలో ఉన్న శివపరివారమూర్తి విగ్రహానికి పంచరంగులు వేయాలని కే ఎస్ రామ రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేలోగా శిఖరేశ్వర ఆలయ ప్లోరింగ్, ప్యాచింగ్ పనులు, అక్కడ గల కటంజనాలకు పెయింటింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. శిఖరేశ్వర ఆలయ వద్ద క్యూలైన్లు తదితర ఏర్పాట్లన్ని కూడా వెంటనే పూర్తి కావాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ వద్ద అవసరమైన అన్ని పనులు చేపట్టాలన్నారు. శిఖరేశ్వరం వద్ద శిఖరేశ్వర పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎప్పటికప్పుడు తీసివేస్తుండాలన్నారు.సుందరీకరణలో భాగంగా శిఖరేశ్వరంలోని వాటవర్ పై అంతస్తులో విద్యుద్దీకరణ ఏర్పాటు చేయాలన్నారు.శిఖరేశ్వర ఆలయం చుట్టూ, పుష్కరిణీ వద్ద పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ముఖ్యంగా క్రొటాన్ మొక్కలు, పూలమొక్కలతో పాటు బిల్వం, కదంబం, తులసీ వంటి దేవతా మొక్కలను పెంచాలన్నారు.
శిఖరేశ్వరం వద్ద ఉన్న కోనేరులోని నీటిని తరుచుగా బయటకు పంపించేస్తుండాలని కార్యనిర్వహణాధికారి నీటి సరఫరా అధికారులను ఆదేశించారు.
శిఖరేశ్వరం, హఠకేశ్వరం ఆలయాల వద్ద మరిన్ని ఫ్లెక్సీబోర్డులు ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.
హఠకేశ్వర ఆలయం వద్ద కూడా కటంజనాలు మొదలైన వాటికి పెయింటిగ్ చేయాలన్నారు.మొత్తం మీద హఠకేశ్వర, శిఖరేశ్వర ఆలయాల వద్ద మరింత ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందే విధంగాను, ఆలయాల పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమములో డిప్యూటీ ఇంజనీర్లు నరసింహరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షకులు శ్రీహరి, శివప్రసాద్, ఏఈలు పాల్గొన్నారు.
16న ఆగమ పాఠశాల పున: ప్రారంభం
దేవస్థానం నిర్వహిస్తున్న వీరశైవాగమ పాఠశాలలో ఈ నెల 16న తరగతులు పున: ప్రారంభకానున్నాయి.
గతంలో కోవిడ్ కారణంగా తాత్కాలికంగా నిలుపుదల చేసారు. వీరశైవాగమ పాఠశాలలో 92 మంది విద్యార్థులు ఉన్నారు.
కాగా కోవిడ్ నిబంధనలను అనుసరించి ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటిస్తూ తరగతులను నిర్వహిస్తారు.
చేతులను శానిటైజేషన్ చేసుకునేందుకు వీలుగా పాఠశాల వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయాలలో శాస్త్రీయ పద్ధతిలో శానిటైజేషన్ కూడా చేయాలని ఆదేశించారు.
పాఠశాలలో విధులు నిర్వహించే వంటస్వాములు చేతులను సబ్బునీటితో శుభ్రపరుచుకోవాలని సూచించారు.
* Sambaraju & Smt Lalitha Devi, Nalgonda, Telangana state donated Rs.One Lakh For Annadhaanam scheme.
* N.Venkata Sai Kiran,Saidabad, Hyderabad donated Rs.1,84,923/- For Gosamrakshana Nidhi.