
శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (10.02.2021) న హైదరాబాద్ కు చెందిన బి. పర్వతయ్య, శారదా దంపతులు దేవస్థానంలో లడ్డూ ప్రసాదాలకు అవసరమయ్యే అల్యూమినియం పాత్రలను విరాళంగా సమర్పించారు.అల్యూమినియంతో తయారు చేసిన, గిన్నెలు, బకెట్లు, జాలిగరిటెలు తదితర వస్తువులను వీరు అందించారు.వీటి విలువ సుమారు రూ.2,58,124లు దాకా ఉంటుందని దాత తెలిపారు. గతంలో కూడా వీరు లడ్డు ప్రసాదాలకు అవసరమైన వస్తువులను అందించారు.దేవస్థానములో వీరు కుటీర నిర్మాణ పథకంలో ఒక కాటేజీ నిర్మాణానికి సహకరించారు . ప్రస్తుతం పూర్తి రాతి నిర్మాణంగా అమ్మవారి యాగశాలను కూడా నిర్మిస్తున్నారు.
ఈ రోజు లడ్డు ప్రసాదాల తయారికి సంబంధించిన వస్తువులన్నింటిని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి, ప్రజాసంబంధాల అధికారికిఅందించారు.
- Saakshi Ganapathi Abhishekam, Jwaala Veerbhadra Swaamy Puuja performed in the temple today by Archaka swaamulu.