అకాడెమీ అఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఈ రోజు ప్రారంభమైన సమీక్ష లో పలు విషయాలు వెల్లడించారు . ఈ సమీక్షలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు స్థాయి అధికారులు, పర్యవేక్షక ఇంజనీరు స్థాయి అధికారులను, శాఖాధికారులైన చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ చీఫ్ లతో పాటు ముఖ్య కార్యదర్శి లతో మంత్రి ముఖాముఖి చర్చలు జరిపారు .ఈ నాలుగు సంవత్సరాలలోనే మరో 5700 కిమీ గ్రామీణ రహదారులను రెండు వరుసల రహదారి అనుసంధానం కల్పించినట్లు మంత్రి చెప్పారు .
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తాము ఎన్నో రహదారులను శాంక్షన్ చేశామని మొత్తం రూ 18,000 కోట్లతో 9000 కిమీ నిడివి గల రహదారిపనులను చేపట్టామని వీటిలో ఇప్పటికి 13,000 కోట్ల నిధుల వ్యయంతో 5800 కిమీ నిడివి గల రహదార్లను అత్యద్భుతంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.వీటిలో భాగంగా 508 వంతెనలను నిర్మిస్తున్నామని వాటిలో సింహభాగం పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.వంతెనలలో చెక్ డాం లను పొందుపరచి నిర్మించిన కట్టడాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయని అన్నారు .