శ్రీశైలంలోని ప్రాచీన కట్టడాల పునరుద్ధరణకు గురువారం భూమిపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. విభూతి మండపం , రుద్రాక్ష మండపం పునరుద్ధరణ పనులకు ప్రారంభంగా స్వాములు అధికారులు ఈ కార్యక్రమాలు చేపట్టారు. విభూతి మఠం వద్ద వేదపండితులు , అర్చక స్వాములు జీర్ణోద్ధరణ సంకల్పాన్ని పఠించారు. మహాగణపతి పూజ నిర్వహించారు.అనంతరం ఈశాన్య భాగంలో నవధాన్యాలు , మొదలైన వాటిని సమర్పించి శంకుస్థాపన జరిపారు. అనంతరం రుద్రాక్ష మండపం వద్ద సంప్రదాయరీతిలో సంకల్పం , గణపతి పూజ నిర్వహించారు. దేవస్థానం ఇంజినీరింగ్ , అధికారులు ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు , స్వామివారి ఆలయ ఉప ప్రధాన అర్చకులు , పలువురు అర్చకులు , వేద పండితులు పాల్గొన్నారు. వీఆర్వో బి. నాగ చంద్రుడు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 25 వ తేదీన ఉదయం 9 గంటలకు శాస్త్రోక్తంగా పూజలు జరిపి దేవత మూర్తులను బాలాలయంలో నెలకొల్పుతారు.