పనుల్లో నాణ్యత పాటించాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ శ్రీరామచంద్రమూర్తి అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఉదయం ఈ ఓ వివిధ అధికారులతో సమీక్ష జరిపారు. దేవస్థానం పరిధిలో పనులను సమీక్షించారు.రింగ్ రోడ్ నిర్మాణం ,లలితా బజార్ వాణిజ్య సముదాయ నిర్మాణం,గణేష్ ఫుడ్ కోర్ట్ నిర్మాణం మొదలైన పనులను సమీక్షించారు. పలువురు కాంట్రాక్టర్లు కూడా పాల్గొన్నారు.వివిధ నిత్య పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.