తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఏఐసిసి నేత గులాంనబీ ఆజాద్ కు వినతిపత్రాన్ని అందించిన టీయుడబ్ల్యుజె.
గడిచిన నాలుగేళ్లలో తెలంగాణలో 224 మంది జర్నలిస్టులు ఆకస్మిక మృతి చెందారు, జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే వైద్య, విద్య, వసతి, వివిధ ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వాలని
యూనియన్ డిమాండ్ చేసిందని ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ తెలిపారు. సమస్యలను , పరిష్కారాలను పరిశీలిస్తామని ఏఐసిసి నేత గులాంనబీ ఆజాద్ హామీ ఇచ్చారని కె.విరాహత్ అలీ తెలిపారు.