కాకినాడ: ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ ప్రభుత్వం సెంటిమెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తోందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలను వైయస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని జనం నవ్వుతున్నారన్నారు. చంద్రబాబు వేషాలు చూసి ప్రజలు అసహ్యంచుకుంటున్నారని చెప్పారు. స్పీకర్ చట్టసభల విలువను దిగజార్చారని విమర్శించారు.