*కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కాలువల కోసం భూసేకరణ రికార్డులను పరిశీలిస్తున్న జేసీ పద్మాకర్.
* కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ సిద్దిపేట జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో రైతుల నుంచి సేకరించిన భూములకు సంబంధించిన రికార్డులను బుధవారం జిల్లా జేసి పద్మాకర్ పరిశీలించారు. గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు ఇప్పటివరకు చెల్లించిన పరిహారం,ఇంకా మిగిలిన రైతులకు(నిర్వాసితులకు) చెల్లించాల్సి ఉన్న పరిహారం , మొత్తం సేకరించిన భూముల వివరాలపై అధికారులతో జేసీ సమీక్షించారు. త్వరితగతిన భూసేకరణను పూర్తి చేయటంతో పాటు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించటంలో జాప్యాన్ని నివారించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ తహసీల్దార్ నిర్మల,ఆరై,విఆర్వో,సిబ్బంది పాల్గొన్నారు. – చైతన్య, గజ్వేల్.