శ్రీశైలం దేవస్థానం లో ఏడో విడత భజన శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది . ఈ శిక్షణా తరగతులు గత నెల 22 న ప్రారంభమయ్యాయి .ఈ కారక్రమంలో నియమితులైన భజన గురువుల ద్వారా గ్రామ , మండల , పట్టణ ప్రాంతాల్లో ఆసక్తి గలవారికి దేవస్థానం తగిన శిక్షణ ఏర్పాటు చేస్తుంది . కర్నూలు , ప్రకాశం జిల్లాలకు చెందిన దాదాపు 50 మందికి శిక్షణ ఇచ్చారు .