ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం ను శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ. శ్రీరామచంద్ర మూర్తి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఓ తో పాటు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ,వేద పండితులు ఉన్నారు. వేద ఆశీర్వచనం అనంతరం శ్రీస్వామి అమ్మ వార్ల ప్రసాదం , శేష వస్త్రం అందించారు. కాగా దేవస్థానం లో ఈ రోజు వివిధ పూజలు ఘనంగా జరిగాయి.